ఒంగోలు కోర్టు సంచలన తీర్పు.. 12 మందికి ఉరిశిక్ష !

ఒంగోలు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. హైవే కిల్లర్ మున్నా 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రధాన ముద్దాయి అబ్దుల్ సమద్ అలియాస్ మున్నాతో పాటు 11 మందికి ఉరిశిక్ష విధించింది. ఇదే కేసులో మరో 7 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

2008లో జాతీయ రహదారిపై వాహనాల చోరీ, డ్రైవర్ల హత్య కేసులో ఈ శిక్ష విధించింది. నిందితులు 7 కేసుల్లో 13 మందిని హత్య చేసినట్లు అభియోగాలున్నాయి. ఈ మున్నా గ్యాంగ్ లోడ్ లారీలను అడ్డగించి చోరీ చేసేదని పలు కేసుల నమోదయ్యాయి. ఈ క్రమంలో లారీ సిబ్బందిని హత్య చేసినట్లు నిర్ధరణ అయింది.