వేధింపుల రచయితకు అవార్డు.. ఇదెక్కడి న్యాయం!

ఎంతోమంది మహిళల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రచయిత వైరముత్తుకు ప్రఖ్యాత ఓఎన్‌వీ అవార్డు ఇవ్వడం విమర్శలకు దారితీసింది. ‘ఇదెక్కడి న్యాయం! వైరముత్తుకు అవార్డుని ఎలా ఇస్తారు ? అంటూ మలయాళీ నటి పార్వతీ ప్రశ్నించింది. ఇప్పటికే 17 మంది మహిళలు వైరముత్తు మీద ఆరోపణలు చేశారని.. వీళ్లే కాకుండా ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో ఎవ్వరికీ పూర్తిగా తెలియదని ఆమె ఆరోపించారు.

“ఓఎన్‌వీ కురుప్‌ (KURUP) మనకెంతో గర్వకారణం. రచయితగా ఆయన అందించిన సేవలు ఎంతో అమూల్యమైనవి. ఆయన రచనలు ప్రతిఒక్కర్నీ ఎంతగానో మెప్పించాయి. అలాంటి మహనీయుడి పేరుతో ఉన్న అవార్డును లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ఈ వ్యక్తికి ఇచ్చి ఎలా అగౌరవపరుస్తారు? గోపాలకృష్ణన్‌తో పాటు జ్యూరీలో ఉన్న సభ్యులందరూ న్యాయం చెప్పాలి’ అని పార్వతీ డిమాండ్ చేశారు.