TSలో 352 కేసులు, 19 మరణాలు !

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 3527 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 19 మంది మృతి చెందారు. 3982మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 519 కొత్త కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 218, ఖమ్మం 215 కేసులు చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 27,793 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 92.81శాతం కాగా.. మరణాల రేటు 0.56శాతంగా ఉంది.