గ్రేట్ : ఫ్రీగా సినిమా చేస్తున్న శర్వా

యంగ్ హీరో ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్ల‌లేదు. ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా కామ్ గా సెటిల్ చేసుకున్నాడు. అలాంటి శర్వా 14 రీల్స్ కి లీగ‌ల్ నోటీసులు పంపించాడు. శ్రీకారం సినిమా పారితోషికం వ్యవహారంలో ఈ నోటీసులు పంపించాడు. రూ. 2 కోట్ల విష‌యంలో శ‌ర్వా నిర్మాత‌లని నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. 14 రీల్స్ తో పంతానికి దిగిన శ‌ర్వా… పైసా పారితోషికం తీసుకోకుండా ఓ సినిమా చేస్తుండటం విశేషం.

శ‌ర్వానంద్ – సాయి పల్లవి జంటగా ‘ప‌డి ప‌డి లేచె మ‌న‌సువ‌చ్చింది. ఈ సినిమాపై న‌మ్మ‌కంతో సుధాక‌ర్ చెరుకూరి భారీగా ఖ‌ర్చు పెట్టారు. శర్వా కూడా ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. కానీ అంచనాలు తలక్రిందులయ్యాయ్. పడి పడి లేచె.. మంచి సినిమా అనిపించుకున్నా.. కమర్షియల్ గా ఆడలేదు. ఇప్పుడు ఆ బ్యాన‌ర్‌లోనే శ‌ర్వాఆడాళ్లూ మీకు జోహార్లూ` అనే సినిమా చేస్తున్నాడు. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా కోసం శ‌ర్వా పారితోషికం ఏమీ తీసుకోలేదు. సినిమా హిట్టయితే.. అందులో లాభాలు తీసుకోనున్నాడట.