మళ్లీ షూటింగులు షురు

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్రలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ షూటింగులు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రబృందాలు తమ సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

రణ్‌బీర్‌ కపూర్‌, శ్రద్ధాకపూర్‌ జంటగా లవ్‌ రంజన్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. ఈ నెల 20 నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. దిల్లీ లేదా ఉత్తరప్రదేశ్‌ల్లో ఈ సినిమా మూడో షెడ్యూల్‌ను పూర్తిచేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో రణ్‌బీర్‌ తల్లిదండ్రులుగా డింపుల్‌ కపాడియా, బోనీ కపూర్‌ నటిస్తున్నారు.