APలో 7,796 కొత్త కేసులు

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో 7,796 కేసులు నమోదయ్యాయి. మరో 77 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 11,629కి చేరింది. కరోనా నుంచి నిన్న 14,641 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 1,07,588 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న కరోనాతో మృతి చెందిన వారిలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది మరణించారు.