లాక్‌డౌన్‌ ఎత్తివేత

కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్నాయ్. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వంఆ పగటి పూట లాక్‌డౌన్‌ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. 

కేవలం రాత్రి కర్ఫ్యూ.. రాత్రి 7గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ ఉంటుంది. వారాంతరాల్లో మాత్రం రోజంతా లాక్‌డౌన్‌ ఉండనుంది. ప్రతీ జిల్లాలో యాక్టివ్‌ కేసులు 600 కంటే తక్కువ ఉండటంతో పాటు ఇన్ఫెక్షన్‌ రేటు సైతం తగ్గుముఖం పట్టడంతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.