ప్ర‌ధాని ఉప‌న్యాసం బ‌హిష్క‌రించే యోచ‌న‌..!!

ఢిల్లీలో వ‌రుస భేటీల‌తో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఆదివారం నీతిఆయోగ్ స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు ఇప్ప‌టికే ఢిల్లీ చేరుకున్న చంద్ర‌బాబు నాయుడు ఎన్డీఏ యేత‌ర ముఖ్య‌మంత్రుల‌తో ఏపీ భ‌వ‌న్ లో స‌మావేశ‌మ‌య్యారు. నీతీఆయోగ్ నాల్గ‌వ పాల‌క‌మండ‌లి స‌మావేశంలో లేవ‌నెత్తాల్సిన అంశాల‌పై ఈ భేటీలో చ‌ర్చించుకుంటున్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుందంటూ ఇప్పటికే నీతిఆయోగ్ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై ముఖ్య‌మంత్రులు నివేదిక‌లు సిద్ధం చేసుకున్నారు. ఒక‌వేళ స‌మావేశంలో రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ప్రస్తావించడానికి అవకాశం ఇవ్వకపోతే ప్రధాని ఉపన్యాసాన్ని బహిష్కరించే యోచనలో ఎన్డీఏ యేతర ముఖ్యమంత్రులు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.