సంచలనం : కేసీఆర్’కు వ్యతిరేకంగా జగదీశ్వర్ రెడ్డి మీటింగ్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం వేడి చల్లారక ముందే.. టీఆర్ఎస్ పార్టీకి మరో తలనొప్పి మొదలైనట్లు తెలుస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డికి సంబంధించి ఓ ఆంగ్ల పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. గత జనవరిలో మంత్రి జగదీశ్ రెడ్డి తన కుమారుడి పుట్టినరోజు వేడుకలను కర్నాటకలోని హంపీలో జరిపారని ఆంగ్ల పత్రిక కథనం తెలిపింది.

ఈ వేడుకలకు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కొంతమంది పార్టీ ప్రముఖులు హాజరయ్యారని, పేరుకు పుట్టిన రోజు వేడుకలైనా.. అక్కడ పార్టీ అంశాలే చర్చకు వచాయని.. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కామెంట్స్ చేసినట్టు రాసింది. ఇప్పుడీ.. ఈ కథనం తెలంగాణ రాజకీయాలని హీటెకిస్తోంది. ఈ కథనాన్ని తన ట్విట్టర్ లో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై తనదైన స్టయిల్ లో సటైర్స్ వేశారు.