రవితేజ సినిమాలో నితిన్

ఓ హీరో కోసం రాసుకొన్న కథ.. మరో హీరోతో తెరకెక్కడం సాధారణ విషయమే. అప్పట్లో దర్శకుడు పూరి జగన్నాథ్ రాసుకొన్న ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి కథలన్నీ పవన్ కల్యాణ్ కోసమే. కానీ ఇవన్నీ రవితేజ హీరోగా తెరకెక్కాయ్. సూపర్ హిట్ అయ్యాయ్. రవితేజని స్టార్ ని చేశాయి.

ఇప్పుడు.. రవితేజ సినిమా ఒకటి కూడా నితిన్ వద్దకు వెళ్లినట్టు సమాచారమ్. కిక్కు దర్శకుడు వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య’ సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఆయన రెండో సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఫైనల్ గా రవితేజతో సినిమా ఫిక్సయింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఐతే ఇప్పుడీ సినిమా ఆగిపోయిందని తెలిసింది. 

ర‌వితేజ బిజీ షెడ్యూల్ వ‌ల్ల‌… వ‌క్కంతంకి డేట్లు ఇవ్వ‌లేక‌పోవ‌డం, వ‌క్కంతం నితిన్‌ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయనకి కథ బాగా నచ్చింది. వెంటనే ఓకే చేసేశారు. దాంతో.. ర‌వితేజ‌తో చేయాల్సిన సినిమా, ఇప్పుడు నితిన్ ద‌గ్గ‌ర‌కు చేరింది నితిన్ చేయాల్సిన ప‌వ‌ర్ పేట‌ రీమేక్ ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆ ప‌వ‌ర్ పేట‌ కోసం… ఉంచిన కాల్షీట్లే.. ఇప్పుడు వ‌క్కంతంకి ఇస్తున్నాడ‌ట‌.