ఈటెల బీజేపీలో చేరిక.. ముహూర్తం ఖరారు !

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 14న దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో భాజపాలో చేరనున్నారు. అదే రోజు ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ ఛైర్మన్‌ తుల ఉమ తదితరులు భాజపాలో చేరనున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తమ పార్టీ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్‌తో ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ గురువారం బీజేపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈటల చేరిక, పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ఈటెల బీజేపీలో చేరికపై స్పష్టత ఇచ్చారు.