ఢిల్లీలో హాట్ టాపిక్ గా తెలంగాణ రాజకీయం

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాజజీయం హాట్ హాటుగా సాగుతోంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడానికి ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ భాజాపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఈటెల భాజాపా కండువా కప్పుకోనున్నారు. ఈటెల చేరికతో తెలంగాణ భాజాపా మరింత బలపడుతుందని.. ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

మరోవైపు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏ క్షణమైనా అధికారిక ప్రకటన రావొచ్చని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ పోస్ట్ ఆశిస్తున్న నేతలు శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డి, జానారెడ్డి.. ఢిల్లీలోనే ఉన్నారు. తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఈటెల భాజాపాలో చేరిక, ఇటు రేవంత్ రెడ్డికి పీసీసీ పోస్ట్ అన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ రాజకీయం ఢిల్లీని హీటెక్కిస్తున్నాయ్.