సెట్లోకి వచ్చేశానోచ్ !!

బాలీవుడ్‌లో ఉత్సాహం మొదలైంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో అక్కడ షూటింగ్స్ మొదలైపోయాయ్. కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన తారలు ఇప్పుడు ఒక్కొక్కరిగా సెట్లోకి అడుగుపెడుతూ ఆనంద పడిపోతున్నారు. వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న భూమిపెడ్నేకర్‌ అయితే తన ఆనందానికి అవధుల్లేవు అంటోంది. ఆమె ప్రస్తుతం ‘రక్షాబంధన్‌’, ‘బధాయి దో’, ‘మిస్టర్‌ లీ’ చిత్రాల్లో నటిస్తోంది.

“మొత్తానికి సెట్లోకి వచ్చేశాను. ఓ విధంగా నేను చాలా అదృష్టవంతురాలిని. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన వెంటనే నాకు షూటింగులో పాల్గొనే అవకాశం దక్కింది. చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. దీన్నుంచి బయటపడటానికి అందరం కలిసికట్టుగా పని చేయాల్సిందే. తిరిగి చిత్ర పరిశ్రమ గాడిలో పడటానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు నిర్మాతలు తీసుకుంటున్నారు. వ్యాక్సినేషన్‌ విషయంలో వేగంగానే అడుగులు వేస్తున్నారు”అని చెప్పుకొచ్చింది భూమి.