నటి కవిత ఇంట్లో విషాదం

ఒక‌వైపు క‌రోనా సెకెండ్ వేవ్ త‌గ్గుతున్నా.. మ‌ర‌ణాలు మాత్రం కొన‌సాగుతూనే ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో అనేక మంది క‌రోనా బాధితులుగా మిగిలారు, మిగులుతున్నారు. తాజాగా సీనియ‌ర్ న‌టి, బీజేపీ నాయ‌కురాలు క‌విత ఇంట్లో మ‌హ‌మ్మారి తీవ్ర విషాదం నింపింది. క‌రోనా బారిన ప‌డ్డ క‌విత కుమారుడు సంజ‌య్ రూప్ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ తుది శ్వాస విడిచాడు.

క‌విత భ‌ర్త ద‌శ‌ర‌థ రాజ్ కూడా ఆ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో వైద్యం తీసుకుంటున్నాడు. ఆయ‌న ప‌రిస్థితి కూడా ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్టు స‌మాచారం. కవిత కొడుకు మరణ వార్త తెలిసి.. సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కవిత భర్త క్షేమంగా బయటపడాలని కోరుకుంటున్నారు.