భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్నిరోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్న పసిడి ధర గురువారం భారీగానే దిగొచ్చింది. దేశ రాజధాని నగరం దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధరపై రూ.861లు తగ్గడంతో రూ.46,863కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ.47,742గా ముగిసింది. 

ప్రపంచ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ తగ్గుదల కనిపించినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషించింది. మరోవైపు, వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనించాయి. కిలో వెండిపై రూ.1709లు తగ్గడంతో 68,798గా ట్రేడ్‌ అవుతోంది.