టాలీవుడ్ : సినిమా షూటింగ్’లపై కీలక నిర్ణయం

కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి షూటింగ్స్ ప్రారంభం కానున్నాయ్. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గురువారం సమావేశమైంది. షూటింగ్‌లపై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తుది దశలో ఉన్న సినిమా చిత్రీకరణలు పూర్తి చేయాలని ప్రకటించింది. ఆ తర్వాతే కొత్త సినిమాల షూటింగ్‌లు ప్రారంభించాలని సూచించింది.

ఇక షూటింగ్ సమయంలో పాటించాల్సిన పలు సూచనలు చేసింది. షూటింగ్స్‌కు హాజరయ్యే నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సభ్యుల నుంచి నిర్మాణ సంస్థలు కరోనా టీకా తీసుకున్నట్లు నిర్ధారించాకే అనుమతి ఇవ్వాలని సూచించింది. ఒక్కడోసు వేసుకున్నవారిని కూడా షూటింగ్‌లోకి అనుమతించాలని తీర్మానించారు. షూటింగ్‌ సమయంలో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని కోరింది.