ధనుష్-శేఖర్ కమ్ముల.. ఓ పాన్ ఇండియా సినిమా !

కోలీవుడ్ హీరో ధనుష్ చేయనున్న డైరెక్ట్ తెలుగు సినిమా ప్రకటన వచ్చేసింది. ఆసియన్ సినిమాస్ అధినేత నారాయణ్ కే దాస్ నారంగ్, తన భార్య జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రకటన విడుదల చేసారు. సెన్సిటివ్ డైరక్టర్ శేఖర్ కమ్ముల తొలిసారి ఈ పాన్ ఇండియా సినిమాను అందించబోతున్నారు. తమిళ, తెలుగు, హిందీల్లో ఈ సినిమాను రూపొందిస్తారు.

ఈ సినిమాలో మరో హీరో కూడా కనిపించనున్నారు. మిడిల్ ఏజ్డ్ హీరో పాత్ర కీలకంగా ఉండనుందట. ఈ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలి అనే కసరత్తు జరుగుతోంది. దాదాపు అరడజను పేర్లు పరిశీలనలో వున్నాయి. వీటిలో ఒకదాన్ని త్వరలో ఫైనల్ చేస్తారు. టాలీవుడ్ సీనియర్ స్టార్  హీరోల్లో ఒకరిని తీసుకొనే అవకాశాలు ఉన్నాయ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం కూడా ట్రై చేస్తున్నట్టు సమాచారమ్. ఇక శేఖర్ కమ్ముల తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’ రిలీజ్ కి రెడీగా ఉంది.