అమెరికాకు చైనా 10 ట్రిలియన్‌ డాలర్లను నష్టపరిహారం !

కరోనా వైరస్ కాదు.. అది చైనా వైరస్. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్ వచ్చిందని మొదటి నుంచి ఆరోపిస్తున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. మరోసారి ఈ అంశంపై మాట్లాడారు. చైనా చేసిన పనికి అనేక దేశాలు కకావికలమయ్యాయి. చైనా ఇది కావాలని చేసినా లేదా ప్రమాదవశాత్తు జరిగినా తీవ్ర నష్టమైతే వాటిల్లింది.   కొవిడ్‌తో తీవ్రంగా నష్టపోయిన అమెరికాకు చైనా 10 ట్రిలియన్‌ డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. 

భారత్‌లో ఏం జరుగుతోందో చూడండి. కొవిడ్‌తో ఆ దేశం సర్వనాశనమైంది. ఒక్క భారత్‌ మాత్రమే కాదు అన్ని దేశాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. అందుకే వైరస్‌ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చిందనేది తేలాల్సిన అవసరం ఉంది. ఇందుకు చైనా సహకారం అందించాలి’ అని ట్రంప్ అన్నారు.