వొడాఫోన్‌ ఐడియా కలిసిపోయాయ్

టెలికాం రంగంలో జియో ఓ సంచలనం. జియో హవాని తట్టుకొనేందుకు మిగితా టెలికాం కంపెనీలు క్రిందా మీదా పడుతున్నాయి. కొన్ని టెలికాం కంపెనీలు భారీ నష్టాలని చవిచూస్తున్నాయి. వొడాఫోన్, ఐడియాల పరిస్థితి కూడా ఇంతే. ఈ రెండు సంస్థలకు కలిసి రూ. 1.15లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్టు సమాచారమ్. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలు చేతులు కలపనున్నాయి. విలీనానికి రంగం సిద్ధం చేసుకొన్నాయి. రెండు కంపెనీలు కలిసి కొత్త కంపెనీని ఏర్పాటు చేయబోతున్నాయ్.

వీటి విలీనానికి ఇంకా టెలికాం శాఖ ఆమోద ముద్ర వేయలేదు. సోమవారం ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే.. ఈ నెల 26న ఐడియా సాధారణ సమావేశాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ సమావేశంలో తమ కంపెనీ పేరుని మార్చుకోనుంది. ఈ వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌కు కొత్త సీఈవోగా బాలేశ్‌ శర్మ ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. వొడాఫోన్ – ఐడియా కలిసి జియోకి గట్టిపోటీని ఇస్తాయేమో చూడాలి.