యాదాద్రిలో భ‌క్తుల ర‌ద్దీ.. స్వామివారిని ద‌ర్శించుకున్న ద‌త్తాత్రేయ‌

అత్య‌ద్భుత పుణ్య‌క్షేత్రంగా అభివృద్ది చెందుతున్న యాదాద్రి ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. ఆల‌య అభివృద్ది ప‌నుల నేప‌థ్యంలో బాలాల‌యంలో స్వామివారి ద‌ర్శ‌నాలు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. వ‌రుస సెల‌వుల నేప‌థ్యంలో కొండ‌కు వ‌చ్చే భ‌క్తుల సంఖ్య పెరిగింది. స్వామివారి ధ‌ర్మ‌ద‌ర్శ‌నానికి 3గంట‌లు, ప్ర‌త్యేక ద‌ర్శ‌నానికి గంట స‌మ‌యం పడుతోంది. కేంద్ర మాజీ మంత్రి బండారు ద‌త్తాత్రేయ స్వామివారిని ద‌ర్శించుకున్నారు.