ఆ రాతలకు.. రకుల్ కి మండింది !

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీ. ఆమె చేతిలో దాదాపు అరడజను బాలీవుడ్ సినిమాలున్నాయ్. ఈ కారణంతోనే ఆమె తెలుగు సినిమాలు చేయడం లేదు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రకుల్ చెప్పింది. 

“లాక్‌డౌన్‌ ఎత్తివేయడం చేత షూటింగ్స్‌ అన్ని ఒక్కసారిగా పట్టాలెక్కుతున్నాయి. దాంతో వరుస షూటింగ్స్‌లో ఫుల్‌ బిజీగా ఉంటున్నాను. కొన్నిసార్లు డేట్స్‌ కూడా సర్దుబాటు కావడం లేదు. డేట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురవడంతోనే తెలుగు ప్రాజెక్ట్‌లకు నో చెప్పాల్సి వస్తుంది” అని రకుల్‌ తెలిపారు.

అయితే ఆ మాటలని వక్రీకరిస్తూ.. తెలుగు చిత్రాల్లో తనకు అవకాశాలు కరవయ్యాయి అని రకుల్‌ చెప్పినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని రాసింది. అది కాస్త రకుల్ దృష్టిలో పడింది. దీంతో క్లిక్స్ కోసం ఎలాంటి హెడ్డింగ్‌లైనా పెట్టేస్తారా? అంటూ రకుల్ ఫైర్ అయ్యింది. 

‘నాకు అర్థం కాని విషయం ఏమిటంటే.. వీళ్లు హెడ్డింగ్‌లో పెట్టినట్లు.. టాలీవుడ్‌లో నాకు అవకాశాలు రావడం లేదని ఎప్పుడు చెప్పాను. ఒక ఏడాది అనగా 365 రోజుల్లో ఇప్పుడు నేను చేస్తున్న ఆరు సినిమాలు కాకుండా కొత్త ఆఫర్స్‌ కోసం దయచేసి నా డేట్స్‌ సర్దుబాటు చేయండి. ఒకవేళ మీరు అలా చేయగలిగితే ఆ విషయంలో మా టీమ్‌కి సాయం చేయండి’ అని రకుల్ ట్విట్ చేసింది.

ఇక బాలీవుడ్ లో బిజీగా ఉన్నా.. కరోనా ఫస్ట్ వేవ్ లాక్‌డౌన్‌ లో ఓ తెలుగు సినిమా చేసింది రకుల్. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఆ తర్వాత కూడా తెలుగు నుంచి ఆమెకు పలు ఆఫర్లు వచ్చాయ్. అయితే బాలీవుడ్ లో ఆరు సినిమాలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో వాటికి నో చెప్పేసింది.