శామీర్ పేట్ చెరువులో దూకి ఇద్దరు వైద్యులు ఆత్మహత్య

మేడ్చల్‌ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. శామీర్ పేట్ చెరువులో దూకి ఇద్దరు వైద్యులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరు కూడా హోమియోపతి దవాఖానకు చెందిన వైద్యులుగా గుర్తించారు. 

ఆత్మహత్యకు పాల్పడే ముందు బైక్‌, బ్యాగులు, సెల్‌ఫోన్లు చెరువుగట్టుపై వదిలేయడంతో వాటి ఆధారంగా వీరిని అల్వాల్లోని ఓ హోమియోపతి దవాఖానకు చెందిన వైద్యులుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాల చెరువులో గాలిస్తున్నారు. వైద్యుల ఆత్మహత్యకు గల కారణాలు ఏంటీ అన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసుల దర్యాప్తులో ఆ వివరాలు తెలియనున్నాయి.