లైవ్ : వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ స్పీచ్

యాదాద్రి జిల్లా తుర్కపలి మండలంలోని వాసాలమర్రి గ్రామానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం గ్రామసభని ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఐక్యమత్యంగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని సీఎం అన్నారు.

గ్రామంలోని ఎవరికి ఏం కావాలి అన్నది లెక్కలు తీయాలి. వారికి సాయం చేసేందుకు నేను సిద్ధం అన్నారు. గ్రామ అభివృద్ది కోసం కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎర్రవల్లి మాదిరిగా వాసలమర్రి కూడా తయారు కావాలి. మరోసారి గ్రామానికి వస్తా.. అప్పుడు చెట్టుకింద కూర్చొని మాట్లాడుకుందాం అని సీఎం అన్నారు. సీఎం కేసీఆర్ స్పీచ్ ఇంకా కొనసాగుతోంది. లైవ్ లో వీక్షించండి!

Live: CM Sri KCR participating in Grama Sabha with Vasalamarri villagers https://t.co/Wb1rAknPZA— Telangana CMO (@TelanganaCMO) June 22, 2021