కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం

వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి, ఒలింపిక్‌ పతక విజేత కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. ఆమెను ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం తొలి వైఎస్ ఛాన్సలర్‌గా నియమిస్తూ ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్ అజ్మిల్‌ హఖ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

దేశంలోనే తొలి స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఇది. పశ్చిమ ఢిల్లీ జిల్లాలోని ముండ్కా పట్టణంలో దీన్ని నిర్మిస్తున్నారు. మరో పదేళ్ల తర్వాత జరిగే ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ కనీసం 50 పతకాలు సాధించాలనే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుస్తోంది.