మెగాస్టార్ పక్కన సోనాక్షి

ప్రస్తుతం కొరటాల శివతో కలిసి ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్‌ బాబీతో కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన సందడి చేసేందుకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హాను తీసుకున్నారని సమాచారమ్. ఆమెకు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారట.

ఇక ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. మే 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుతో పాటు రామ్‌చరణ్‌ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. కాజల్‌ అగర్వాల్‌, పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరు.. వేదాళం, లూసిఫర్‌ రీమేక్‌లలో నటించాల్సి ఉంది. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు సినిమా ఉండనుంది.