TS సీఎస్‌, డీజీపీకి నోటీసులు

తెలంగాణ సీఎస్‌, డీజీపీ, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ, డిప్యూటీ కమిషనర్‌కు ఎస్సీ కమిషన్‌ నోటీసులు పంపింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో దళిత మహిళ మరియమ్మ(55) పోలీస్‌ కస్టడీలో అనుమానాస్పద మృతికి సంబంధించి ఈ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారో తెలిపాలని ఆదేశించింది. వారంలోగా సమాధానం ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ పేర్కొంది.

ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడకు చెందిన అంబడిపూడి మరియమ్మను అడ్డగూడూరు దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. విచారించారు. ఈ క్రమంలో భాగంగా పోలీస్‌ కస్టడీలో ఆమె మృతిచెందింది. దీంతో ఆ ఠాణా పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు విచారణ చేపట్టారు. అనంతరం ఎస్సై మహేశ్‌, కానిస్టేబుళ్లు రషీద్‌, జానయ్యలను సస్పెండ్‌ చేస్తూ రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.