అసలు మెగాస్టార్’ని లాగింది ఎవరు ?

మూడ్నెళ్ల ముందే ‘మా’ ఎన్నికలు హీట్ మొదలైంది. సెప్టెంబర్ లో ‘మా’ ఎన్నికలు జరగనున్నాయ్. అయితే ఇప్పటికే నలుగురు పోటీలోకి దిగారు. నాలుగు గ్రూపులు కట్టారు. గుంపుగా మీడియా ముందుకు కూడా వచ్చేశారు. శుక్రవారం తన గ్రూపు సభ్యులతో కలిసి మీడియా ముందుకొచ్చిన ప్రకాష్ రాజ్.. మీడియాపై పడిపోయాడు. ‘మా’ ఎన్నికలు హీటెక్కడానికి కారణం మీడియానే అన్నట్టుగా మాట్లాడారు. మీడియా అతి చేస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. ఇందులోకి మెగాస్టార్ ని ఎందుకు లాగుతున్నారు ? అని ప్రశ్నంచారు. 

కానీ అసలు మెగాస్టార్ ని లాగింది ప్రకాష్ రాజ్ నే. మూడ్నెళ్ల ముందు నుంచే ఆయన మా ఎన్నికల బరిలోకి దూకారు. మెగాస్టార్ చిరంజీవి అనుమతి తీసుకున్నారు. ఆ వెంటనే మీడియాకు ఎక్కాడు. ఛానెన్ల చుట్టూ తిరిగుతూ.. ఇంటర్వ్యూ ఇచ్చారు. మెగాస్టార్ ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పాడు. మా ఎన్నికల వేడి రగిలించాడు. ఇప్పుడేమో.. మీడియా ముందుకొచ్చి.. మెగాస్టార్ ని ఎందుకు లాగుతున్నారు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రకాష్ రాజ్ మీడియా మీద పడిపోవడానికి వేరే కారణం ఉంది.

మా ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ అనే లొల్లి మొదలైంది. దాన్ని మీడియా హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేసింది. లోకల్ కార్డ్ మంచు విష్ణుకు ప్లస్ కానుందని విశ్లేషించింది. అది ప్రకాష్ రాజ్ కి నచ్చలేదు. దీంతో గుంపుగా మీడియా ముందుకొచ్చి.. మీడియాపైనే పడిపోయాడు. మాలో లొల్లి పెట్టిస్తోంది మీడియా అంటున్నారు. కానీ ఈ హీట్ కు కారణం ముమ్మాటికి అతడే.