మా ఎన్నికలు : నరేష్ కౌంటర్‌ సమావేశం

‘మా’ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నటుడు ప్రకాశ్‌రాజ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మా ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. తనపై వస్తున్న నాన్ లోకల్ కామెంట్స్ పై కూడా రియాక్ట్ అయ్యారు. ఈ సమావేశానికి కౌంటర్‌గా తాజాగా ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్‌ మీడియా ముందుకు వచ్చారు.

గడిచిన నాలుగేళ్ల కాలాన్ని చూసుకుంటే ‘మా’ మసకబారిపోయింది” అంటూ శుక్రవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తనని ఎంతో బాధించాయని నరేష్ అన్నారు. తాను అధ్యక్షుడిగా ‘మా’ ఇప్పటివరకూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నాకు కథలు మాట్లాడడం రాదు. కాగితాలతో రావడం అలవాటు. ఎవర్నో ధూషించడానికో, ఎవరిపైనో కాలు దువ్వడానికో ఈ సమావేశం పెట్టలేదు. గడిచిన ఎలక్షన్స్‌లో నాకెంతో ఆప్తురాలైన జయసుధ ఓడిపోవడం నాకెంతో బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు.