పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవలు

తెలంగాణలో లాక్‌డౌన్‌ కారణంగా తపాలా కార్యాలయాల్లో నిలిచిపోయిన పాస్‌పోర్టు సేవలు ఈ నెల 10 నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. 

వరంగల్‌ జిల్లాలోని హన్మకొండ, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, సిద్దిపేట, మెదక్‌, వికారాబాద్‌, మేడ్చల్‌, వనపర్తి, భువనగిరి, మహబూబాబాద్‌, కామారెడ్డి, అదిలాబాద్‌ జిల్లాల్లోని 14 ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని తపాలాశాఖ సహాయ సంచాలకులు రామకృష్ణ తెలిపారు.