TS ఇంటర్ ఫలితాలు విడుదల.. ఆల్ పాస్ !

తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయ్. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులగా ప్రకటించారు. ఇక గ్రేడ్ ల వారీగా చూస్తే.. 176719 మంది విద్యార్థులు ఏ-గ్రేడ్‌ కాగా.. 104886 మంది బీ గ్రేడ్‌ లో ఉత్తీర్ణులు అయ్యారు. 61,887 మంది సి-గ్రేడ్‌ కాగా.. 108093 మంది విద్యార్థులు డి గ్రేడ్‌ తో ఉత్తీర్ణత సాధించారు.

ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,28,754 మంది బాలికలు కాగా.. 2,22,831 మంది బాలురు ఉన్నారని మంత్రి సబితా చెప్పారు. గత యేడాది ఇంటర్ పరీక్షలు సగంలో ఉండగా కరోనా విజృంభణ మొదలైంది. ఆ తర్వాత మిగితా పరీక్షలని నిర్వహించే అవకాశం దొరకలేదు. కరోనా సెకండ్ వేవ్ తో ఈసారి పరీక్షలు రద్దయ్యాయ్. దీంతో అందరినీ పాస్ చేస్తూ.. తాజా ఫలితాలని విడుదల చేశారు.