ఆ క‌ల‌యిక భావ‌సారుప్యం లేనిది..!!

నీతిఆయోగ్ పాల‌క‌మండ‌లి స‌మావేశంలో ఢిల్లీలో జ‌రిగిన ప‌రిణామాల‌పై ఏపీ బీజేపీ నేత పురందేశ్వ‌రి స్పందించారు. జగన్ , పవన్ కళ్యాణ్ తో బీజేపీ కలిసి పని చేస్తోంద‌నడం కేవ‌లం ప్ర‌చారం మాత్ర‌మేన‌ని ఆమె కొట్టిపారేసారు. 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో బీజేపీ ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌ని, ఎవ‌రితో పొత్తులు పెట్టుకునే ప్ర‌స‌క్తి లేద‌ని తేల్చి చెప్పారు. నీతిఆయోగ్ లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌డు లేవ‌నెత్తిన అంశాల‌కు కేంద్రం స‌మాధానం చెప్ప‌లేద‌న‌డం అస‌త్య ప్రచార‌మ‌ని చెప్పారు. ఢిల్లీలో న‌లుగురు ముఖ్య‌మంత్రుల క‌ల‌యిక భావ‌సారుప్యం లేనిద‌ని, వారు ఎంత‌కాలం క‌లిసి ప‌నిచేస్తారో చూడాలని అన్నారు పురందేశ్వ‌రి. ఏపీ అభివృద్ధికి బీజేపీ క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు.