ఏపీలో 3,620 కొత్త కేసులు, 41 మరణాలు !

ఏపీలో గడిచిన 24 గంటల్లో 3,620 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 41 మంది మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,85,716కి చేరింది. మృతుల సంఖ్య 12,671కి చేరింది.

24 గంటల వ్యవధిలో 5,757 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,32,971కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో40,074 యాక్టివ్‌ కేసులున్నాయి.