ఏపీ కేబినేట్ పలు కీలక నిర్ణయాలు.. ఇవే !

* సీఎం జగన్ అధ్యక్షత ఏపీ కేబినేట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.మొబైల్ వెటర్నరీ అంబులెన్సుల కొనుగోలుకు ఆమోదం

* 9 నుంచి 12వతరగతి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ

* ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పేర్నమెట్టలో.. ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఏర్పాటు

* విజయనగరం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలను.. యూనివర్శిటీగా మార్చేందుకు అంగీకారం

* 2021-24 ఐటీ విధానానికి ఆమోదం

* టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్ల నిర్మాణం, మౌళిక సదుపాయాలకు 5,990 కోట్ల బ్యాంక్‌ గ్యారెంటీకి అంగీకారం

* విజయవాడ గుణదలలో కొత్త పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్

* ఏపీ భూమి హక్కు చట్ట సవరణకు ఆమోదం

* పీహెచ్‌సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు 90 కోట్ల మంజూరుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.