పెరిగిన వంట గ్యాస్‌ ధరలు

అసలే కరోనా కాలం. చేద్దామంటే పని లేదు. సామాన్యుడు చేతుల్లో పైసల్లేవ్. జీవితం గడవడమే భారంగా మారుతోంది. ఇలాంటి టైమ్ లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రో ధరలు మండిపోతున్నాయ్. ఇవి చాలదు అన్నట్టు.. ఇప్పుడు వంట గ్యాస్ ధరలు కూడా పెరిగాయి.

దేశవ్యాప్తంగా సిలిండర్‌పై రూ.25.50 పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి. తాజా ధరల పెంపుతో దిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.834.50కి.. 19 కిలోల సిలిండర్‌ ధర రూ. 1,550కి చేరింది.