నిర్మాత సి. నిర్మాతకు సుప్రీం నోటీసులు

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి. కల్యాణ్ పై భూ కబ్జా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాదు శివారు హఫీజ్ పేటలోని సర్వే నంబర్ 80లో కొంత భూమి తనదని సి.కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన ఆ భూముల్లో నిర్మాణాలు చేపట్టారు.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ హమీదున్నీసా బేగం, సెహెబ్బాదీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం.. ఫైనల్ డిక్రీ పొందకుండా కట్టడాలు ఎలా కడతారు ? అని ప్రశ్నించింది. ఫైనల్ డిక్రీ ఇవ్వలేదని హైకోర్టు తీర్పులో స్పష్టంగా ఉందని గుర్తు చేసింది. ఈ విషయంలో స్పందించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి, కల్యాణ్ కు సుప్రీం నోటీసులు జారీ చేసింది.