టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. మళ్లీ విచారణ మొదలు !

టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి అభియోగ పత్రాలను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఈ కేసు విచారణ మొదలు కానుంది. 

ఈ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురిని సిట్‌ గతంలో విచారించింది. ఈ కేసులో 30 మందిని అరెస్టు చేసి, 27 మందిని విచారించారు. 12 కేసులకు గాను 8 కేసుల్లో అభియోగపత్రాలు దాఖలు చేశారు. విచారణకు హాజరైన వారి నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించి నివేదికలను పొందుపరిచి అభియోగపత్రాలను దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం ఆమోదించడంతో త్వరలో న్యాయ విచారణ ప్రారంభం కానుంది.