AP, TS ఈరోజు కరోనా కేసులు ఎన్నంటే ?

తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం పట్టినా.. కొత్త కేసులు, మరణాల సంఖ్యలో  హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో  కొత్తగా 2,925 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 26 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,20,178కి కరోనా కేసులు చేరగా, కరోనాతో 12,986 మంది మరణించారు. అలాగే 29,262 యాక్టివ్‌ కేసులు ఉండగా, 18,77,930 మంది రికవరీ అయ్యారు. ఏపీలో 24 గంటల్లో 3,937 మంది రికవరీ అయ్యారు.

ఇక తెలంగాణలో  గడిచిన 24 గంటల్లో 704 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,218కి చేరింది. నిన్న ఒక్క రోజే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,725కి పెరిగింది. నిన్న 917 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,16,769కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,724 యాక్టివ్ కేసులు ఉన్నాయి.