అజిత్ సడెన్ స్రపైజ్

కోలీవుడ్ స్టార్ అజిత్.. తన అభిమానులకు సడెన్ సప్రైజ్ ఇచ్చారు. వినోథ్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న చిత్రం ‘వాలిమై’. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోణీ కపూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అప్ డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఏ స్థాయిలో ఉన్నాయన్నది అంతర్జాతీయ స్థాయిలో తెలిసేలా చేశారు.

అంతర్జాతీయ వేదికల నుంచి వాలిమై అప్ డేటు ఎప్పుడు ? అంటూ ఫ్లకార్డ్స్ ప్రదర్శించారు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లోనూ, #EURO2020 మ్యాచ్ లోనూ వాలిమై అప్ డేట్ గురించి అడిగారు. ఎట్టకేలకు అభిమానుల కోరిక తీరుస్తూ.. వాలిమై ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఒక్క పిక్ కాదు.. అరడజను పోస్టర్స్ ని  ఒకేసారి వదిలారు. దీంతో.. అజిత్ అభిమానులకు విందు భోజనం పెట్టినట్టయింది. ఇక వాలిమై డిజిటల్ రైట్స్ ని జీ ప్రీమియమ్ సొంతం చేసుకుంది.