మహేష్ మెచ్చిన అభిమన్యుడు

మిత్రన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన విశాల్ చిత్రం ‘ఇరుంబు తెరై’. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగులో ‘అభిమన్యుడు’గా విడుదలయ్యింది. ఇక్కడ మంచి వసూళ్లని రాబడుతోంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 7. 5 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ‘పందంకోడి’ తర్వాత తెలుగులో విశాల్ కు దక్కిన పెద్ద విజయం ఇదే. ఇప్పుడీ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ప్రశంసల జల్లు కురిపించారు.

‘సినిమా పట్ల తాను చాలా ఇంప్రెస్ అయ్యా. దర్శకుడు మిత్రన్ విజన్, డైరెక్షన్ చాలా బాగాన్నాయి. బాగా రీసెర్చ్ చేసి రాసిన సినిమా. సినిమాలో వేగం కూడా ఉంది. విశాల్, చిత్రబృందానికి అభినందనలు’ అంటూ ట్వీట్ చేశాడు మహేష్. ఈ చిత్రంలో విశాల్ సరసన సమంత జతకట్టింది. తెలుగు ప్రేక్షకులని థియేటర్స్ రప్పించడంలో సమంత కీలక పాత్ర పోషించదని చెబుతున్నారు.