జల వివాదం : తెలంగాణకు షాక్ ఇచ్చిన కేంద్రం

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గోదావ‌రి యాజ‌మాన్య బోర్డుల పరిధుల‌ను ఖరారు చేస్తూ గెజిట్ల‌ను విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 14 నుంచి ఈ గెజిట్ నోటిఫికేష‌న్ అమ‌లులోకి రానుంది.వ్బ‌చావ‌త్ ట్రైబ్యున‌ల్ కేటాయింపులున్న ప్రాజెక్టుల‌న్నీ కృష్ణాబోర్డు ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని కేంద్రం పేర్కొంది. కృష్ణాన‌దిపై 36, గోదావ‌రిపై 71 ప్రాజెక్టుల‌ను ఈ బోర్డు ప‌రిధిలోకి తీసుకొచ్చింది. 

బోర్డుల‌కు ఛైర్మ‌న్లు, స‌భ్య‌కార్య‌ద‌ర్శి, చీఫ్ ఇంజ‌నీర్లు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన‌వార‌ని, అన్ని ప్రాజెక్టుల నిర్వాహ‌ణ బోర్డులే చూసుకుంటాయ‌ని గెజిట్ లో తెలిపింది. ఒక్కోరాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు చోప్పున డిపాటిట్ చేయాల‌ని, సీడ్ మ‌నీ కింద 60 రోజుల్లో ఈ మొత్తాన్ని డిపాటిట్ చేయాల‌ని కేంద్రం పేర్కొంది. నిర్వాహ‌ణ ఖ‌ర్చుల‌కు అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాల‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.ఇక అనుమ‌తిలేని ప్రాజెక్టులు 6 నెల‌ల్లోగా అనుమ‌త‌లు తెచ్చుకోవాల‌ని, ఒక‌వేళ అనుమ‌తులు రాకుంటే ప్రాజెక్టులు నిలిపివేయాల‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

కేంద్ర విడుదల చేసిన గెజిట్ ను ఏపీ ప్రభుత్వం స్వాగతించగా.. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీనిపై ఈరోజు సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించనున్నారు. ఈ సందర్భంగా కేంద్రానికి సీఎం కేసీఆర్ తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేస్తారా ? లేక రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై విజ్ఝప్తులు చేస్తారా ?? అన్నది చూడాలి.