నీలి చిత్రాల కేసు : నటి శిల్పాశెట్టి భర్త అరెస్ట్

ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నీలి చిత్రాలు నిర్మించిన కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు. గత ఫిబ్రవరిలో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేశారు. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారని కుంద్రాపై ఆరోపణలు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు మా దగ్గర ఉన్నాయని, ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్‌కుంద్రాను కనిపిస్తున్నాడని ముంబయి పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

మరోవైపు రాజ్ కుంద్రా ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాజ్‌ కుంద్రా 2009లో శిల్పాశెట్టిని వివాహం చేసుకున్నారు. 2012లో వారికి వియాన్‌ జన్మించాడు. గతేడాది వారు సరోగసి ద్వారా సమిష అనే పాపకు జన్మనిచ్చారు. జేఎల్‌ స్ట్రీమ్‌ యాప్‌ యజమాని అయిన రాజ్‌ కుంద్రా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టీం రాజస్థాన్‌ రాయల్స్‌కు సహ యజమానిగా ఉన్నారు.