‘నవరస’ ట్రైలర్ వచ్చేసింది

ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మిస్తోన్న వెబ్‌ సిరీస్‌ ‘నవరస’. ఆగస్టు 6 నుంచి ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. టైటిల్‌కి తగ్గట్టుగానే అన్ని రకాల భావోద్వేగాలతో ఆద్యంతంగా ఆసక్తిగా సాగింది ఈ ట్రైలర్. ప్రతీ నటుడు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

శాంతం, కరుణ, రౌద్రం, భయానకం.. ఇలా నవరసాల నేపథ్యంలో తొమ్మిది భాగాలుగా ఈ సిరీస్‌ రానుంది. ఒక్కో భాగాన్ని ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సూర్య, సిద్ధార్థ్‌, ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ సేతుపతి, రేవతి, ఐశ్వర్యరాజేశ్‌, అరవింద్‌ స్వామి, రోబో శంకర్‌, యోగిబాబు, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్‌ని మరో దర్శకుడు జయేంద్రతో కలిసి నిర్మిస్తున్నారు మణిరత్నం.