టైమ్ మిష‌న్ ఎక్కేస్తున్న శర్వా

ఇప్పుడు టాలీవుడ్ లో టైమ్ మిష‌న్ ల ట్రెండ్ మొద‌లైంది. ద‌ర్శ‌కులంతా ఇప్పుడు టైమ్ మిష‌న్ నేప‌థ్యంలో క‌థ‌లు రాసుకుంటున్నారు. ‘ఆదిత్య 369’ సీక్వెల్ గా ఆదిత్య999 రెడీ అవుతోంది. ఈ కథని స్వయంగా బాలయ్య రాయడం విశేషం. 2023లో సెట్స్ మీదకు వెళ్లనుందని చెబుతున్నారు.

ప్ర‌భాస్ – నాగ అశ్విన్ కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతానికి ప్రాజెక్ట్ కె అనే నామ‌క‌ర‌ణం చేశారు. ఇందులో టైమ్ మిష‌న్ కాన్సెప్ట్ కూడా ఉంద‌ట‌. ఇప్పుడు శ‌ర్వానంద్ కూడా టైమ్ మిష‌న్ ఎక్కేస్తున్నాడు. ఓ కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ‌కు శ‌ర్వా ఓకే చెప్పాడు. ఇది టైమ్ మిష‌న్ క‌థే. టైమ్ మిష‌న్ లో శ‌ర్వా… త‌న బాల్యంలోకి వెళ్ల‌డమే ఈ క‌థా నేప‌థ్యం. 1990లోని అంద‌మైన జ్ఞాప‌కాల్ని నెమ‌రేసుకోవ‌డం ఈ క‌థ‌లోని పాయింట్.