పుష్ప టీమ్.. 20 మందికి వైర‌ల్ ఫీవ‌ర్ !

పుష్ప  టీమ్ లోని దాదాపు 20 మందికి వైర‌ల్ ఫీవ‌ర్ వ‌చ్చింది. ఇటీవ‌ల హైద‌రాబాద్ లోని డాగ్ హౌస్ లో… పుష్ష‌ షూటింగ్ జ‌రిగింది. ఆ టైమ్ లోనే ద‌ర్శ‌కుడు సుకుమార్ డెంగ్యూ బారీన ప‌డ్డారు. దీంతో షూటింగ్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

నిజానికి సుకుమార్ ఒక్క‌డికే కాదు. పుష్ప చిత్రబృందంలోని దాదాపు 20 మందికి డెంగ్యూ సోకింద‌ని స‌మాచారం. ఆ సెట్లో బ‌న్నీ, ర‌ష్మిక‌లు కూడా ఉన్నారు. వీళ్లిద్దరు మాత్రం డెంగ్యూ నుంచి త‌ప్పించుకున్నారు. ఇప్పటికే సుకుమార్ మిన‌హా మిగిలిన వాళ్లంతా కోలుకున్నారు. సుకుమార్ మాత్రం ఇంకా కోలుకోవాల్సి ఉంది. ఆయనకి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని టాక్.