TokyoOlympics : క్వార్టర్‌ ఫైనల్స్‌కు పి.వి.సింధు

Tokyo Olympicsలో తెలుగు తేజం పి.వి సింధు అదరగొడుతోంది. బుధవారం ప్రీక్వార్టర్స్‌లో జరిగిన మ్యాచ్‌లో  12వ ర్యాంక్‌ క్రీడాకారిణి బ్లింక్‌ ఫెల్ట్‌(డెన్మార్క్‌) పై సింధు 21-15,21-13 తేడాతో విజయం సాధించారు. దీంతో ఆమె క్వార్టర్‌ ఫైనల్స్‌లో అడుగు పెట్టారు. మొత్తం 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి కోలుకోవడానికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు.

బుధవారం జరిగిన రెండో గ్రూప్‌ మ్యాచ్‌లో ఆరో సీడ్‌ సింధు 21-9 21-16తో 34వ ర్యాంక్‌ క్రీడాకారిణి నాన్‌ చూంగ్‌ (హాంకాంగ్‌)ను చిత్తుచేసింది. పి.వి సింధు జోరు చూస్తుంటే.. పథకం పక్కా అనిపిస్తోంది.