కరోనా బారినపడిన పోసాని ఫ్యామిలీ

మహమ్మారి కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. ఫస్ట్, సెకండ్ వేవ్ లలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. వీరిలో కొందరు తిరిగి కోలుకోలేదు. ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దాదాపు తగ్గిపోతున్న టైమ్ లో నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ కుటుంబం కరోనా బారిపడింది. ఈ విషయాన్ని స్వయంగా పోసానినే తెలిపారు.

ప్రస్తుతం గచ్చిబౌళిలోని ఒక ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్టు తెలిపారు.
పోసానికి కరోనా సోకడంతో రెండు ఆయన న‌టిస్తున్న రెండు పెద్ద సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. దీనిపై పోసాని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలు త‌న‌ను క్ష‌మించాల‌ని ఆయ‌న‌  కోరారు.తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పోసాని కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు దేవుడ్ని వేడుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.