రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెలలోనే రుణమాఫీ !

తెలంగాణ కేబినేట్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటీ జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెలలోనే రుణమాఫీ పూర్తిలని నిర్ణయించారు. ఆగస్టు 15 నుంచి ఈనెలాఖరులోపు రూ.50వేల రుణమాఫీని పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేబినెట్‌ నిర్ణయంతో రూ.50వేల లోపు రుణం తీసుకున్న 6లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

ఇక కొత్తగా మంజూరైన ఏడు వైద్య కళాశాలల ప్రారంభంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. వచ్చే విద్యా సంవత్సరమే వైద్య కళాశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్‌, చెస్ట్‌ ఆసుపత్రి ప్రాంగణం, టిమ్స్‌లో, గడ్డిఅన్నారం మార్కెట్‌, ఆల్వాల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జిల్లాల్లో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. మందులు, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని అధికారులను కేబినెట్‌ ఆదేశించింది.