తెలంగాణ ద్రోహులంతా తెరపైకి వచ్చారు

తెలంగాణ ద్రోహులంతా తెరపైకి వచ్చారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో ఉద్యమకారులంతా కనుమరుగవుతూ పోతున్నరని అన్నారు. అనారోగ్యం నుంచి కోలుకుని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన అనంతరం ఈటల మీడియా సమావేశం నిర్వహించారు.

హుజూరాబాద్ లో ఒక్కో నాయకుడికి ఖరీదు కట్టి కొనుగోళ్ల పర్వానికి తెరలేపారని.. ఇప్పటికే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రూ.150కోట్లను నగదు రూపంలో ఖర్చు చేశారని ఈటల ఆరోపించారు. హుజూరాబాద్ లో గెలిచేందుకు సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలను నమ్ముకున్నారన్నారు. మానుకోటలో ఓదార్పు యాత్ర సమయంలో ఉద్యమకారులపై రాళ్లదాడి చేసిన వ్యక్తికి ప్రాధాన్యం కల్పించారని.. ఆ వ్యక్తిని ఎమ్మెల్సీగా నియమించారన్నారు.