మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గినట్టే.. తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,593 మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారు. తాజా కేసుల్లో 64.6శాతం కేసులు ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. 

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.25కోట్లు దాటింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య మళ్లీ 600 దాటింది. నిన్న 648 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. కేరళలో 173 మంది మృతిచెందారు. వైరస్‌ దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4,35,758 మంది కొవిడ్‌కు బలయ్యారు. ఇక 24 గంటల వ్యవధిలో మరో 34,169 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.17కోట్ల మంది కరోనాను జయించగా.. రికవరీ రేటు 97.67శాతానికి చేరింది.