అద్దం ముందు రెచ్చిపోయిన ప్రగ్యా

అందాన్ని చూపించేది అద్దం. దాని ముందే రెచ్చిపోయింది హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్. మిర్రర్ సెల్ఫీలో అందాలని ఆరబోసింది. కూల్ లుక్స్ తో కేకపెట్టించింది. దానికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడీ.. ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘కంచె’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ప్రగ్యా జైశ్వాల్. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. కానీ విజయాలు దక్కలేదు. అయితే ఆడపాదడపా సినిమాల్లో నటిస్తోంది. మిగతా సమయాల్లో ఫోటో షూట్స్ తో బిజీగా గడుపుతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోనూ ఈ బ్యూటీకి పరిచయాలు ఎక్కువే. ప్రస్తుతం బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ చిత్రం అఖండ సినిమాలో నటిస్తోంది.